ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 16, 2021, 11:44 AM IST

ETV Bharat / state

జిల్లాలో ఆందోళనకరంగా కొవిడ్ వ్యాప్తి

అనంతపురం జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా 2975 మంది వైరస్ బారిన పడ్డగా.. మరో 12 మంది మృతి చెందారు.

కొవిడ్ కేసులు
covid cases

అనంతపురం జిల్లాలో కొవిడ్ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా 2975 మంది కొత్తగా వైరస్ బారిన పడినట్లు నిన్న విడుదలైన బులెటిన్ లో వెల్లడైంది. ప్రస్తుతం జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో, హోం ఐసోలేషన్ లో 15 వేల 852 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా 12 మంది ఈ మహమ్మారి కారణంగా మరణించారు.

అనంత నగరంలో 374 మంది, అనంత గ్రామీణంలో 149, ధర్మవరంలో 258 మందికి కొత్తగా వైరస్ సోకింది. అన్నిచోట్లా ఆసుపత్రుల్లో పడకల కొరత తీవ్రంగా ఉంది. ఆక్సిజన్, వెంటిలేటర్ పడకలు ఎక్కడా లభించని కారణంగా.. చాలా మంది బాధితులు ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. అక్కడా పడకలు ఖాళీ లేక కొందరు ఆందోళనకు గురవుతున్నారు. చాలామంది అనవసరంగా సీటీ స్కాన్ పరీక్ష చేయించుకుంటూ.. కొద్దిపాటి ఇన్ ఫెక్షన్ ఉందని రిపోర్టు వచ్చినా ఆసుపత్రుల్లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details