ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బిల్లులు మంజూరు చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యం: కాంట్రాక్టర్లు

రెండేళ్లుగా బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నమని కర్నూలులో కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాలన్ని కోరారు. లేకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని స్పష్టం చేశారు.

By

Published : Oct 10, 2020, 3:52 PM IST

contractors demands to be sanction bills at Kurnool district
బిల్లులు మంజూరు చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యం: కాంట్రాక్టర్లు

కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో రెండేళ్లుగా చేసిన పనులకు బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ పరిధిలో చేసిన పలు అభివృద్ధి పనులకు బిల్లులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బిల్లులు రాక మానసికంగా అందోళన చెందుతున్నామన్నారు.

అనారోగ్యం పాలవుతున్నామని ఆవేదన చెందారు. ఈ విషయమై కర్నూలులో మీడియా సమావేశం నిర్వహించారు. బిల్లులు మంజూరు చేయకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని వారు స్పష్టం చేశారు. సత్వరమే నిధులు విడుదల చేయనిపక్షంలో.. సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details