కానిస్టేబుల్ ప్రభాకర్ రెడ్డి విధులు నిర్వహించి ఇంటికి తిరుగుప్రయాణం అవుతుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచిన ఘటన అందరిని కలిచివేస్తోంది. అనంతపురం కళ్యాణదుర్గం బైపాస్ నందు బస్ డ్రైవర్ నిర్లక్ష్యంతో కానిస్టేబుల్ అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రభాకర్ రెడ్డి స్వస్థలం అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం తలుపురు గ్రామం కాగా, బాధిత కుటుంబాన్ని జిల్లా ఎస్పీ సత్య ఏసు బాబు పరామర్శించి,పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.
డ్రైవర్ నిర్లక్ష్యంతో కానిస్టేబుల్ మృతి
బస్ డ్రైవర్ నిర్లక్ష్యంతో నిండుప్రాణాలు పోయిన ఘటన గుదిబండలో చోటుచేసుకుంది.ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ అక్కడిక్కడే మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
constable died of bus driver negligence at ananthapuram district