ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తుంగభద్ర ఎగువ కాలువను పరిశీలించిన కలెక్టర్ గంధం చంద్రుడు

అనంతపురం జిల్లా కనేకల్ , బొమ్మనహాళ్ ఆంధ్ర సరిహద్దులోని తుంగభద్ర ఎగువ కాలువను (హెచ్​ఎల్​సీ) జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పరిశీలించారు. నీటి వాటా లెక్కల రికార్డులు పరిశీలించారు. నీటి పంపిణీకి సంబంధించిన సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు.

By

Published : Oct 17, 2020, 8:21 PM IST

collector gandham chandrudu visit tungabhadra canal in ananthapuram district
తుంగభద్ర ఎగువ కాలువను పరిశీలించిన కలెక్టర్ గంధం చంద్రుడు

అనంతపురం జిల్లా కనేకల్ , బొమ్మనహాళ్ ఆంధ్ర సరిహద్దులోని తుంగభద్ర ఎగువ కాలువను (హెచ్​ఎల్​సీ) జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పరిశీలించారు. హెచ్​ఎల్​సీ అధికారులతో కలిసి నీటి మట్టం, ఇరు రాష్ట్రాల నీటి లెక్కలపై ఆరాతీశారు. హెచ్​ఎల్​సీ కాలువ గట్టుల పరిస్థితిపై అధ్యయనం చేశారు. హెచ్ఎల్​సీ ఆధునీకరణ పనులను సమీక్షించారు. నీటి వాటా లెక్కల రికార్డులు పరిశీలించారు. నీటి పంపిణీకి సంబంధించిన సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు.

కనేకల్ మండల కేంద్రంలోని శ్రీ చిక్కనేశ్వర చెరువు, హెచ్ఎల్సీ కాలువ, అక్విడేట్​ను కలెక్టర్ పరిశీలించారు. ఆయకట్టు మాగాణి భూములను, ఆంధ్రా సరిహద్దు బొమ్మనహాళ్ మండలంలోని హెచ్ఎల్​సీ గేజ్, గుంతకల్లు రిజర్వాయర్​ను సందర్శించారు. తుంగభద్ర జలాశయం నుంచి హెచ్​ఎల్​సీ ద్వారా ఆంధ్ర సరిహద్దులోకి వస్తున్న నీటిని గురించి అధికారులతో చర్చించారు. ఈ ఏడాది జలాశయాల్లో సమృద్ధిగా నీరు ఉండటంతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు తాగు, సాగునీరు అందిస్తామని కలెక్టర్ చెప్పారు. ఐఏబీ సమావేశంలో చేసిన తీర్మానాల మేరకు నీటి కేటాయింపులు చేపడతామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details