ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 9, 2019, 10:29 PM IST

ETV Bharat / state

ఓటమిపై అధైర్యం వద్దు.. అండగా ఉంటా: చంద్రబాబు

తెదేపా ఓటమితో కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని... తాను ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు.

తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు

రైతులు కష్టపడి పెంచుకున్న చెట్లను నరికేసే సంస్కృతికి... వైకాపా నేతలు తెరలేపారని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆరోపించారు. అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా... ధర్మవరం వెళ్లే మార్గంలో బుక్కరాయసముద్రంలో చంద్రబాబు ఆగారు. అధినేతకు కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. శింగనమల నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలతో.. కాసేపు రోడ్ షో నిర్వహించారు. ఓటమితో ఎవరూ అధైర్యపడవద్దని... తాను ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. అందరం కలసి కట్టుగా ప్రజా సమస్యలపై పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details