CBN reacted on gutthi rtc bus stand incident: అనంతపురం జిల్లా గుత్తి ఆర్టీసీ బస్టాండ్లో పైకప్పు పెచ్చులూడి మహిళ తలపై పడి తీవ్ర గాయాలైన అంశంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ట్విటర్లో స్పందించారు. టికెట్ చార్జీలు పెంచిన ప్రభుత్వానికి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే బాధ్యత లేదా అని అన్నారు. ఆర్టీసీ బస్సు ఎక్కితే చక్రాలు ఎప్పుడు ఊడిపోతాయో తెలీదని,.. బస్సులో ఉన్నా గొడుగులు పట్టుకు కూర్చోవాల్సి వస్తోందని మండిపడ్డారు. గుత్తి ఆర్టీసీ బస్టాండ్లో పైకప్పు పెచ్చులూడి, బస్సు కోసం ఎదురు చూస్తున్న మహిళకు తీవ్ర గాయాలు కావడంపై విచారం వ్యక్తం చేశారు. కొత్త నిర్మాణాలు సరే,.. కనీసం ఉన్నవాటికి నిర్వహణ కూడా చేతకాదా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఆర్టీసీ ప్రయాణికులకు ఇదేనా ప్రభుత్వం కల్పించే భద్రత అని నిలదీశారు.
టికెట్ చార్జీలు పెంచిన ప్రభుత్వానికి.. ప్రయాణికుల భద్రత పట్టదా: చంద్రబాబు
CBN reacted on gutthi rtc bus stand incident: గుత్తి ఆర్టీసీ బస్టాండ్లో పైకప్పు పెచ్చులూడి మహిళ తలపై పడి తీవ్ర గాయాలైన ఘటనపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పందించారు. టికెట్ చార్జీలు పెంచిన ప్రభుత్వానికి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే బాధ్యత లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. గాయాలైన మహిళ పట్ల ట్విటర్లో విచారం వ్యక్తం చేశారు.
cbn reacted on gutthi rtc bus stand incident