అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలంలోని నాగినాయనచెరువు గ్రామంలో తొలి ఏకాదశి పండుగ సందర్భంగా... ఆంజనేయస్వామి ఆలయంలో జ్యోతులు ఉత్సవం నిర్వహించారు. మహిళలు రంగురంగుల పువ్వులతో జ్యోతులను అలంకరించుకొని... తలపై మోసుకుంటూ ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు మాస్కులు ధరించారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించిన తరువాత జ్యోతులతో ఆంజనేయ స్వామిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతపురం జిల్లాలో ఘనంగా జ్యోతుల ఉత్సవం
తొలి ఏకాదశి పండుగ సందర్భంగా అనంతపురం జిల్లా నాగినాయన చెరువు గ్రామంలో జ్యోతుల ఉత్సవాన్ని నిర్వహించారు. ఆంజనేయస్వామి ఆలయంలో ఈ వేడుకను చేయగా... మహిళలంతా మాస్కులు పెట్టుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతపురం జిల్లాలో ఘనంగా జ్యోతుల ఉత్సవం