ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Blind Students First Time Written SSC Exams on Computer: కంప్యూటర్​లో పదో తరగతి పరీక్ష రాసిన అంధులు.. దేశంలోనే తొలిసారి

First Time Blind Students Took the tenth class exams on the computer: ఆశయం, సంకల్పబలం ఉంటే ఎలాంటి.. లోపాన్నైనా జయించవచ్చని నిరూపించారు ఆ అమ్మాయిలు. అసలే పుట్టుకతోనే అంధులు.. మరోవైపు పేదరికం ఇబ్బంది పెడుతోంది. అయితేనేం చదువులో మేటిగా రాణించాలనే పట్టుదలతో ముందుకు సాగారు. అందుకు ఆర్​డీటీ స్వచ్ఛంద సంస్థ తోడ్పాటు అందించింది. ఫలితంగా దేశంలో తొలిసారి కంప్యూటర్‌లో టెన్త్ పరీక్షలు రాసిన అంధ విద్యార్థులుగా రికార్డు సాధించారు. మరి.. ఎవరా విద్యాకుసుమాలు? ఇది వారికెలా సాధ్యమైంది ఈ కథనంలో తెలుసుకుందాం.

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 30, 2023, 10:08 PM IST

Blind_Students_First_Time_Write_Tenth_Exams_on_Computer_in_AP
Blind_Students_First_Time_Write_Tenth_Exams_on_Computer_in_AP

Blind Students First Time Written SSC Exams on Computer: కంప్యూటర్​లో పదో తరగతి పరీక్ష రాసిన అంధులు.. దేశంలోనే తొలిసారి

RDT Trust Blind Students First Time Written SSC Exams on Computer in Anantapur :చిన్నప్పటి నుంచి ఎన్నో కలలు కన్నారు. కానీ విధి చిన్నచూపు చూసి అంధులను చేసింది. అయినా ఎక్కడా తగ్గలేదు. లోపాన్ని సైతం లెక్క చేయకుండా చదువుల్లో రాణించాలనే దృఢ నిశ్చయంతో ముందుకు సాగారు. ప్రతిఫలంగా అత్యాధునిక సాంకేతికతను అనుసరించి.. ల్యాప్‌టాప్‌ల్లో పదో తరగతి పరీక్ష రాసి మంచి మార్కులు సాధించారు ఆ విద్యార్థులు.

ల్యాప్‌టాప్‌తో సాధన చేస్తున్న ఆ ఆరుగురు అమ్మాయిల పేర్లు దివ్యశ్రీ, ఎం.శ్రీధాత్రి, పి. చైత్రిక, యు.నాగరత్నమ్మ, ఇ.సౌమ్య, సి.పావని. వీరు అనంతపురం జిల్లాలోని ఆర్​డీటీ దివ్యాంగుల పాఠశాలకు చెందినవారు. ఇందులో కొందరు పుట్టుకతో చూపులేని వారైతే, మరొకరు అనారోగ్యంతో హఠాత్తుగా కంటి చూపు కోల్పోయిన వారు. వారందరిని అక్కున చేర్చుకుని తీర్చిదిద్దుతోంది ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ.

అంధులకు సర్కార్​ 'స్పెషల్​' స్కూల్​.. చదువుతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులు టాప్​!

సాధారణంగా అంధులు ఏ పరీక్ష రాయాలన్నా సహాయకులు అవసరం. వీళ్లు సమాధానాలు చెబుతుంటే వారు రాస్తుంటారు. కానీ, దేశంలోనే తొలిసారిగా.. ల్యాప్‌టాప్‌లు వినియోగించి సహాయకులు అవసరం లేకుండా.. అంధ విద్యార్థులే సొంతంగా పదోతరగతి పరీక్షలు రాశారు. అంతే కాదు మంచి ఫలితాలు సాధించి.. మన్ననలు అందుకున్నారు ఈ విద్యార్థులు.

"నేను 6వ తరగతిలో ఇక్కడ చేరాను. మాకు 8వ తరగతి ల్యాప్​ట్యాప్స్​ అందించారు. మేము ల్యాప్ ​ట్యాప్​లో ఏ కీ ఎక్కడ ఉంటుందో నేర్చుకున్నాము. పదో తరగతి పరీక్షలు రాసే నెల ముందు నుంచి సాధన చేశాము." -శ్రీ ధృతి, విద్యార్థిని

తొలిసారి స్వయంగా పదో తరగతి పరీక్షలు రాసిన ఆంధ విద్యార్థులు..

ల్యాప్‌టాప్‌లో ఉన్న ప్రశ్నపత్రాన్ని హెడ్‌ఫోన్ల ద్వారా విని, జవాబును టైప్‌ చేశారు ఈ విద్యార్థులు. ఇందుకోసం నాన్‌ విజబుల్‌ డెస్క్‌ టాప్‌ యాక్సెస్‌ సాఫ్ట్‌వేర్‌ వినియోగించారు. అందులో టైప్‌ చేసిన జవాబులు ప్రింట్‌ తీసి.. ఓఎంఆర్‌ షీట్‌కు జత చేస్తారు. పరీక్షలకు ముందు 45 రోజుల్లోనే ఈ విధానంలో శిక్షణ పొంది ఫలితాలు సాధించి భళా అనిపించారు ఈ విద్యార్థులు.

"మాకు ఆరు, ఏడు తరగతి చదువుతున్న సమయంలో కంప్యూటర్​ ల్యాబ్​కు వెళ్లి.. అక్కడ ఉపాధ్యాయుల సహాయంతో కంప్యూటర్​లో ఏ వరుసలో ఏ కీ ఉంటుందనే విషయాన్ని మొదటగా నేర్చుకున్నాము. కోవిడ్​ సమయంలో మాకు ల్యాప్​ ట్యాప్స్​ ఇచ్చారు. ఏ అప్లికేషన్​ ఎలా ఓపెన్​ చేయాలి.. ఎలా వాడాలి అనేది నేర్చుకున్నాము." -సౌమ్య, విద్యార్థిని

చూపు లేకపోతేనేం... మంచి మనసుంది...!

అనుకుంటే సాధ్యం కానిది ఏది లేదు. అందుకే వీళ్లకి కూడా ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి.. తెలివైన విద్యార్థులుగా తీర్చిదిద్దాలనేది మా ఉద్ధేశ్యం అని చెబుతున్నారు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు. ఈ క్రమంలోనే కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఎన్​వీడీఏ సాఫ్ట్​వేర్ వారికి మార్గాన్ని ఎంచుకున్నామని చెబుతున్నారు.

"ల్యాప్​ ట్యాప్స్​, ట్యాబ్స్​ విద్యార్థులకు అందించాము. విద్యార్థులు మొదట ల్యాప్​ ట్యాప్​ వినియోగించి నోట్స్​ రాసుకునేవారు. నోట్స్​ మాత్రమే కాదు పరీక్షలు కూడా రాయోచ్చని.. రామ్​కమల్​ నూతన సాఫ్ట్​వేర్​ ఇచ్చారు."-గౌస్, ఆర్డీటీ ఇన్ క్లూజివ్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు

అంధుల కోసం హైటెక్ షూస్.. దారికి అడ్డొస్తే అంతే!

దేశంలో ఇప్పటి వరకు అంధ విద్యార్థులు పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఆన్‌లైన్‌లో రాయలేదని.. కేరళకు చెందిన విద్యావేత్త , సాఫ్ట్‌వేర్‌ నిపుణుడు రామ్‌ కమల్‌ చెబుతున్నారు. అలాగే వచ్చే పరీక్షల్లో మరింత మంది పిల్లలు పరీక్షలు రాసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన. సూచిస్తున్నారు.

"2023 పదో తరగతి పరీక్షలలో 6గురు కంప్యూటర్​ ద్వారా పరీక్ష రాశారు. 2025లో 500 మంది వరకు అంధ విద్యార్థుల చేత కంప్యూటర్​ ద్వారా పరీక్ష రాయించాలని అనుకుంటున్నాము. ఇలా వీరు స్వయంగా పరీక్ష రాయటం వల్ల.. స్వతంత్రంగా ఉండగల్గుతారు. ఎవరి సహాయం లేకుండా చదువుకోగలరు" -రామ్ కమల్, విద్యావేత్త

ఆరుగురు నిరుపేద విద్యార్థులకు ఆర్​డీటీ స్వచ్ఛంద సంస్థ అండగానిలిచి.. సరికొత్త రికార్డుని సాధించేలా చేసింది. దాంతో ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగారు ఈ అమ్మాయిలు. భవిష్యత్‌లో జరిగే అన్ని పరీక్షలను కూడా ల్యాప్‌టాప్ ద్వారానే రాసేలా తీర్చిదిద్దుతున్నట్లు స్వచ్ఛంద సంస్థ, ఉపాధ్యాయులు తెలిపారు.

అంధులు కారు వీరు...ఆత్మ బలశూరులు : చినజీయర్​ స్వామి

ABOUT THE AUTHOR

...view details