ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఈసీ బృంద పర్యటన

అనంతపురం, తాడిపత్రి, ధర్మావరం నియోజకవర్గాల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి మాలిక్ బృందం పర్యటించింది. ఓటర్ల జాబితాను పరిశీలించారు.

By

Published : Feb 22, 2019, 9:05 PM IST

కేంద్ర ఎన్నికల కమీషన్ కార్యదర్శి మాలిక్ బృందం

అనంతపురం జిల్లాలో కేంద్ర ఎన్నికల సంఘంకార్యదర్శి మాలిక్ బృందం పర్యటించింది. అనంతపురం, తాడిపత్రి, ధర్మవరం నియోజకవర్గాల్లోని ఓటర్ల జాబితాలో బోగస్ ఓటర్లను చేర్చారంటూ పలు ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఇద్దరు సభ్యులతో కూడిన ఓ బృందాన్ని జిల్లాకు పంపింది. ఇందులో భాగంగా తనిఖీ బృందం జిల్లా కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ జీవీజీ అశోక్ కుమార్ లతో సమావేశం నిర్వహించింది.ఆ మూడు నియోజకవర్గాల్లో 1640 ఓట్లు, రెండుసార్లు నమోదైనట్లు గుర్తించి వాటినితొలగించినట్లు కలెక్టర్ వెల్లడించారు. బోగస్ ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకుప్రత్యేకంగా వినియోగిస్తున్న కంప్యూటర్ అప్లికేషన్ పనితీరు ను మాలిక్ కు వివరించారు. అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులుజిల్లా కలెక్టర్, ఎస్పీలకు పలు అంశాలపైసూచనలు చేశారు.

జిల్లా పర్యటనలో కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి మాలిక్

ABOUT THE AUTHOR

...view details