అనంతపురం జిల్లా ధర్మవరంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురుకి గాయాలయ్యాయి. ధర్మవరం సంజయ్ నగర్ లో మహమ్మద్, రంగనాథ్ అనే యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య మాట మాట పెరిగి కర్రలు, కొడవళ్లతో దాడి చేసుకున్నారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దాడి చేసిన వారి కోసం గాలిస్తున్నారు.
ఇరువర్గాల ఘర్షణలో.. ముగ్గురికి తీవ్ర గాయాలు
అనంతపురం జిల్లా ధర్మవరంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి.
ఇరువర్గాల ఘర్షణలో..ముగ్గురికి గాయాలు