ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మాస్క్ లేకుండా తిరిగారు.. క్వారెంటైన్​కు వెళ్లారు

By

Published : Jun 18, 2020, 10:55 PM IST

కరోనా వ్యాధి నియంత్రణ చర్యల్లో భాగంగా అనంతపురం పోలీసులు వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. మాస్కులు లేకుండా నగరంలో తిరుగుతున్న వారిని ఆపి అంబులెన్స్​లో క్వారంటైన్​కు తరలించారు.

ananthapuram district
మాస్క్ లేకుండా తిరిగారు.. క్వారెంటైన్ కు వెళ్లారు

అనంతపురంలో రోజురోజుకు కరోనా విజృంభిస్తున్నా ప్రజలు కనీస బాధ్యతలు మరిచి మాస్కులు లేకుండా తిరుగుతున్నారని రెండో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ జాకీర్ హుస్సేన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాస్కులు లేకుండా నగరంలో తిరుగుతున్న ఆరుగురిని అంబులెన్స్​లో క్వారంటైన్​కు తరలించారు.

మద్యం షాపుల వద్ద విచ్చలవిడిగా మందుబాబుల మాస్కులు లేకుండా తిరుగుతున్నారని ఇలాంటి కార్యక్రమం చేపట్టామని చెప్పారు. ప్రతి ఒక్కరూ మాస్కులు వేసుకోవాలని ఆయన సూచించారు.

ABOUT THE AUTHOR

...view details