ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాడికి ఉరితాళ్లతో వినూత్న నిరసన

అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్యలకు పాల్పడిన కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ రైతుసంఘం(సీపీఐ అనుబంధం) ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కాడికి ఉరితాళ్లు కట్టి వినూత్నంగా నిరసన తెలిపారు.

By

Published : Aug 5, 2019, 7:33 PM IST

ధర్నా చేస్తున్న రైతులు

ధర్నా చేస్తున్న రైతులు

అనంతపురంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు ఎక్స్​గ్రేషియా చెల్లించాలని కోరుతూ రైతుసంఘం ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. ప్రధాన రహదారిపై వినూత్న ప్రదర్శన నిర్వహించారు. కాడికి ఉరితాళ్లు కట్టి... వారే ఉరేసుకుంటున్నట్టు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ... వైకాపా అధికారంలోకి వచ్చి రెండునెలలు కావస్తున్నా రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందించిన దాఖలాలు లేవన్నారు. ఆదివారం ఒక్కరోజు జిల్లాలో నలుగురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, ప్రస్తుత రైతుల దీనావస్థకు ఇది అద్దం పడుతోందని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్​గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details