ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాముకాటుకు వ్యక్తి మృతి.. వైద్యుల నిర్లక్ష్యం కారణమా?

పాముకాటుకు గురైన వ్యక్తి మృతిచెందిన ఘటన అనంతపురం జిల్లా మడకశిరలో జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన అన్న మరిణించినట్లు మృతుడి తమ్ముడు ఆరోపించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

By

Published : Apr 14, 2020, 7:42 PM IST

పాముకాటుకు వ్యక్తి మృతి
పాముకాటుకు వ్యక్తి మృతి

పాముకాటుకు వ్యక్తి మృతి

అనంతపురం జిల్లా జిల్లడగుంట గ్రామానికి చెందిన నరసింహమూర్తి (29) తన పొలంలో పాము కాటుకు గురయ్యాడు. అతని కుటుంబీకులు వెంటనే మడకశిర ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యులు అతనికి చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం హిందూపురం ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని సూచించారు. కొద్దిసేపటి తర్వాత పరిస్థితి విషమించి వ్యక్తి చనిపోయాడు.

మృతుడి బంధువుల ఆరోపణ

వైద్యుల నిర్లక్ష్యం వల్లే నరసింహమూర్తి మృతి చెందాడని మృతుడి బంధువులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. మృతుని బంధువులు, వైద్యులు, ఎమ్మెల్యే ఎదుట ఘర్షణ పడ్డారు. ఎమ్మెల్యే వారిని సముదాయించగా.. గొడవ సద్దుమణిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

ఇంటి గోడలో పాముల గుంపు... తవ్వినకొద్దీ ఒళ్లు జలదరింపు!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details