ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 7, 2023, 3:53 PM IST

ETV Bharat / state

నీటి కోసం మహిళల నిరసన

Women Protest for Drinking water: తాగునీటి కోసం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం చెట్టుపల్లిలో మహిళలు రోడ్డెక్కారు. స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగారు. మంచినీటి కొళాయిలు, బోర్లు కొద్దిరోజులుగా పనిచేయడం లేదని పాలకుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని.. ఆవేదన వ్యక్తంచేశారు.

protest
నిరసన

Women Protest for Drinking water: తాగునీటి కోసం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం చెట్టుపల్లి గ్రామానికి చెందిన మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుమీద ఆందోళన చేపట్టారు. స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన. కుళాయిలు, బోర్లు గత కొన్ని రోజులుగా పనిచేయక పోవటంతో ఇబ్బందులు పడుతున్నారు. పాలకుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోవటంతో మహిళలంతా ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని బాధితులు స్ధానిక భీముని పట్నం నర్సీపట్నం రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అయితే స్ధానిక నాయకుల చొరవతో కొద్దిసేపటి తర్వాత విరమించారు.

ABOUT THE AUTHOR

...view details