ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 22, 2023, 6:06 PM IST

ETV Bharat / state

వేతనం అడిగితే ఉద్యోగం తీసేశారు! పాత వారిని తొలగించి కొత్తగా నియామకాలు

Officials Dismissed Women Security Guards in Alluri District: జీతం తక్కువ వస్తుందని కలెక్టర్​కు ఫిర్యాదు చేయడంతో విధులనుంచి తొలగించారంటూ.. అల్లూరి జిల్లాలోని గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల, ట్రైబల్ బాలికల గురుకులాల్లో విధులు నిర్వహించే మహిళా సెక్యూరిటీ గార్డులు ఆవేదన చెందుతున్నారు. నిరుపేద కుంటుంబం నుంచి వచ్చిన మేము ఈ ఉద్యోగంపైనే ఆధారపడి బతుకుతున్నామని ఆందోళన చెందుతున్నారు.

women_security_guards
women_security_guards

వేతనం అడిగితే ఉద్యోగం తీసేశారు! పాత వారిని తొలగించి కొత్తగా నియామకాలు

Officials Dismissed Women Security Guards in Alluri District:కొండ నాలుకకు మందు కావాలని వెళ్తే ఉన్న నాలిక ఊడినట్లు అయ్యింది ఆ మహిళల పరిస్థితి. జీతం తక్కువ వస్తుంది, బకాయి పడిన జీతం కావాలి అని కలెక్టర్​ని కలిస్తే చివరికి రాజకీయ నాయకులు రంగ ప్రవేశం చేసి వారి ఉద్యోగమే కోల్పోయే పరిస్థితి వచ్చింది.. సెక్యూరిటీ గార్డులుగా ఉద్యోగం చేస్తున్న ఆ మహిళలకు. వివరాల్లోకి వెళ్తే.. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలు, కళాశాలలు, ట్రైబల్ బాలికల గురుకులాల్లో 62 మంది సెక్యూరిటీ గార్డులుగా థర్డ్ పార్టీలో సుమారు రెండేళ్లుగా పనిచేస్తున్నారు. రెండు నెల కిందట తమకు జీతం తక్కువ వస్తుందని జిల్లా కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. అప్పుడు సంబంధిత సూపర్వైజర్​ని పిలిచి థర్డ్ పార్టీ నుంచి వచ్చే జీతం 18 వేలకు, 7500 మాత్రమే తక్కువ ఇవ్వడంపై ఆగ్రహించారు.

భోజనంలో పురుగులు, మూడురోజులుగా తాగునీరు లేదు - విద్యార్థినుల ఆందోళన

కలెక్టర్ ఆదేశాలతో మహిళా సెక్యూరిటీ స్టాఫ్ విజయవాడ వెళ్లారు. సెక్యూరిటీ సంస్థ యాజమాన్యాన్ని కలిశారు. వారు ఉద్యోగ భద్రతపై హామీ ఇచ్చి పంపించేసారు. థర్డ్ పార్టీ తామే ఉంటే లాభ పడవచ్చని స్థానిక ప్రజా ప్రతినిధులు రంగంలో దిగారు. సెక్యూరిటీ సంస్థ గడువు ముగిసిందని సాకు చెప్పి కొత్త నియామకం చేశారు. పాత వాళ్లకు ఎటువంటి సమాచారం అందించకుండా కొత్తవారికి సెక్యూరిటీ బాధ్యతలు అప్పచెప్పడంతో ఆవేదన చెందారు. పేదవారైన తాము దానిపైనే ఆధారపడుతున్న మహిళా సెక్యూరిటీ గార్డ్స్ కంగుతిన్నారు. ఈ ఘటనపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని కలిసి సమస్య వివరించారు. చిరు ఉద్యోగాలపై ప్రజా ప్రతినిధుల పెత్తనం ఏంటని గిడ్డి ఈశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏడు వందల మందికి 5 బాత్​రూమ్​లు-వాటిని మాతో కడిగిస్తున్నారు : గిరిజన విద్యార్థులు

ఆ మహిళలు పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని కలవడానికి ప్రయత్నం చేయగా ఆమె భర్త అడ్డుపడి.. మేడమ్ గారికి ఈ విషయం తెలియదు వచ్చాక చెబుతామంటూ పంపించేసారు. పాడేరు ఏపీఆర్ కళాశాలకు ముగ్గురు కొత్తగా మహిళా సెక్యూరిటీ పంపించగా.. అక్కడే ఉన్న 20 మంది మహిళ సెక్యూరిటీ గార్డులు వీరిని అడ్డగించి తాముండగా రావద్దని వెనక్కి పంపించేశారు. అదే సమయంలో వచ్చిన సెక్యూరిటీస్ మేనేజర్​ను కూడా ప్రశ్నించి తమను కొనసాగించాలి లేదంటే ఎవరినీ రానీయమని అడ్డుకున్నారు.

చదువు, విశ్రాంతి, భోజనాలు తరగతి గదులే సర్వస్వం - గురుకులాల్లో జగనన్న వసతి కష్టాలు

సదరు మేనేజర్ రాజకీయ నాయకులు అండతో ఇది జరుగుతుందని అక్కడి నుంచి వెళ్లిపోయారు. మేనేజర్​ను ఎమ్మెల్యే అనుచరుడు ద్విచక్ర వాహనంపై తీసుకుని వెళ్లిపోయాడు. దీంతో మహిళా సెక్యూరిటీ గార్డులు అసలు విషయం గుర్తించి తామను ఎమ్మెల్యే మోసం చేశారంటూ అంటూ ఆవేదన చెందారు. సెక్యూరిటీ గార్డ్స్ థర్డ్ పార్టీగా ఎమ్మెల్యే కనుసైగల్లో అనుచరులు వ్యవహరిస్తూ తమ పొట్ట కొడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. ఈ చిరు ఉద్యోగాన్ని నమ్ముకుని పేద మహిళ సెక్యూరిటీ విధులు నిర్వహిస్తూ కాలం గడుపుతున్నామని తమకు న్యాయం చేయాలని ఆవేదన చెందుతున్నారు. తమ ఉద్యొగం ఇవ్వకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details