ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / sitara

15 ఏళ్ల తర్వాత మాధురీ-అనిల్

అద్భుతమైన నటిగానే కాకుండా డ్యాన్సర్​గానూ పేరుతెచ్చుకుంది మాధురీ దీక్షిత్. సరికొత్తగా టోటల్​ ధమాల్​ చిత్రంలోనూ అలరించిందీ అమ్మడు. బాలీవుడ్​ స్టార్లు అజయ్​, అనిల్​ ఇందులో నటించారు.​

By

Published : Feb 12, 2019, 6:08 PM IST

మాధురీ-అనిల్

'టోటల్​ ధమాల్​' చిత్రం నుంచి 'స్పీకర్​ పట్​ జాయే' పాట విడుదలైంది. ఇందులో అనిల్​ కపూర్​-మాధురీ దీక్షిత్ మధ్య కెమిస్ట్రీ బాగుంది. అజయ్​ దేవగణ్ సింహంతో ఎంట్రీ ఇచ్చి​, ఇషా గుప్తాతో కాలు కదిపాడు. ఈ సినిమాకు ఇంద్రకుమార్ దర్శకత్వం వహించాడు. చిత్రం ఫిబ్రవరి 22న విడుదల కానుంది.
గౌరవ్​-రోషిన్​ అందించిన సంగీతం అద్భుతంగా ఉంది. మాధురీ దీక్షిత్​తో 15 సంవత్సరాల తర్వాత వెండితెర పంచుకుంటున్నాడు అనిల్.

'ప్రేక్షకుల కోసం మంచి కామెడీ కమర్షియల్ చిత్రంతో వస్తున్నాం. ఆదరిస్తారని ఆశిస్తున్నాం. మా మధ్య వచ్చిన పుకార్లను పట్టించుకోవట్లేదు' -అనిల్ కపూర్

'స్రిప్టు వినగానే చాలా కామెడీగా అనిపించింది. ఇలాంటి చిత్రాల్లో స్టోరీ లోతుగా లేకపోయినా ఫన్ మాత్రం ఉంటుంది' -అజయ్ దేవగణ్

మాధురీ పేరు వాడుకొని ఎమ్​ఎఫ్​ హుస్సేన్​ పెయింటిగులు పొందినట్లు అనిల్​పై పుకార్లు వచ్చాయి. ఈ విషయంలో విభేదాల వల్లే ఇన్ని సంవత్సరాలు విడిగా ఉన్నారని సోషల్​ మీడియాలో కామెంట్లు వచ్చాయి.

వాటిపై స్పందించిన అనిల్​..'ఒకరోజు నా భార్య సునీత ఎమ్​ఎఫ్​ హుస్సేన్​ పెయింటింగ్ కావాలని అడిగింది. అప్పుడు అంత డబ్బులు లేవు. అందుకే మాధురీని అడిగితే ఇద్దరం కలిసినపుడు ఇస్తా అని చెప్పింది. కాని ఈ విషయం తెలుసుకున్న హస్సేన్​ గిఫ్ట్​గా పెయింటింగ్​ పంపించారు. ఇప్పటికీ అది మా ఇంట్లోనే ఉంది. నా భార్య కలెక్షన్​కు ఆమె ఈ విధంగా సహాయం చేసింది. ఆ క్రెడిట్​ మొత్తం మాధురీకే దక్కుతుంద'ని వెల్లడించాడు.

ABOUT THE AUTHOR

...view details