ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 19, 2020, 11:42 AM IST

ETV Bharat / jagte-raho

తెలంగాణ:ఈతకు వెళ్లి ముగ్గురు మృతి

తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఈత సరదా ముగ్గురి ప్రాణం తీసింది. తల్లిదండ్రుల రోదనలతో లక్ష్మీపురం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

telengana
ఈతకు వెళ్లి ముగ్గురు మృతి

తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లిన ముగ్గురు మృతి చెందారు. మృతులు అప్పారావు (35), తేజు (20), వినయ్‌ (20) గా గుర్తించారు. స్థానికుల సాయంతో ముగ్గురి మృతదేహాలను చెరువులో నుంచి బయటకు తీశారు. చేతికందొచ్చిన బిడ్డలు విగతజీవుల్లా పడిఉండటం చూసి తల్లిదండ్రులు బోరుమన్నారు.

ABOUT THE AUTHOR

...view details