ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వలస కూలీలతో వెళ్తున్న లారీ బోల్తా.. 19 మందికి గాయాలు

రహదారులపై ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. స్వస్థలాలకు చేరాలన్న ఆరాటంలో.. దొరికిన వాహనం ఎక్కుతున్న వలస కార్మికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ క్రమంలో.. శనివారం తెల్లవారు జామున తెలంగాణలోని నిర్మల్​ జిల్లాలో లారీ బోల్తా పడింది.

By

Published : May 16, 2020, 2:01 PM IST

Published : May 16, 2020, 2:01 PM IST

telengana accident
వలస కూలీలతో వెళ్తున్న లారీ బోల్తా.. 19 మందికి గాయాలు

తెలంగాణలోని నిర్మల్‌ జిల్లా కొండాపూర్‌ వద్ద వలస కూలీలు ప్రయాణిస్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 19 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌ లోని మేడ్చల్‌ నుంచి వలస కూలీలు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌ పూర్‌ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

క్షతగాత్రులను నిర్మల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులంతా ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద సమయంలో లారీలో సుమారు 60 మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమించగా.. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.

ABOUT THE AUTHOR

...view details