ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 12, 2020, 3:58 PM IST

ETV Bharat / jagte-raho

రూ.1800 కోసం గొడవ.. స్నేహితుడిపై హత్యాయత్నం

హైదరాబాద్‌ హఫీజ్ ‌బాబానగర్‌లో దారుణం జరిగింది. రూ.1800 విషయంలో చెలరేగిన గొడవ.. కత్తులతో దాడికి దారితీసింది.

hyderabad
హైదరాబాద్‌లో స్నేహితునిపై కత్తితో దాడి

హైదరాబాద్ కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హఫీజ్‌బాబానగర్‌లో 1800 రూపాయల విషయంలో చెలరేగిన గొడవ.. కత్తుల దాడికి దారితీసింది. మోషిన్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి యూనస్, అర్షద్ అనే మరో ఇద్దరిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.

ఈ దాడిలో అర్షద్ తీవ్రంగా గాయపడగా.. యూనస్‌కు స్పల్ప గాయాలయ్యాయి. గొడవను ఆపేందుకు వెళ్ళిన మరో వ్యక్తి కూడా గాయాలపాలయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఆర్షద్ పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details