ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 25, 2021, 7:54 PM IST

ETV Bharat / jagte-raho

శనగ పంట నూర్పిడి యంత్రంలో పడి యువకుడు దుర్మరణం

ప్రమాదవశాత్తు శనగ పంట నూర్పిడి యంత్రంలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లా చింతలపల్లె గ్రామంలో జరిగింది.

a young man dies after falling into a machine
శనగ పంట నూర్పిడి యంత్రంలో పడి యువకుడు దుర్మరణం

కర్నూలు జిల్లా మిడుతూరు మండలం చింతలపల్లె గ్రామంలో శనగ పంట నూర్పిడి యంత్రంలో పడి యువకుడు దుర్మరణం చెందాడు. జూపాడుబంగ్లా మండలం తుడిచెర్ల గ్రామానికి చెందిన సోఫీ సాహెబ్ మై మూన్ చిన్న కుమారుడు ఖయ్యూం బీటెక్ పూర్తి చేశారు. లాక్​డౌన్ కారణంగా ఉద్యోగ అవశాలు లేక పొలం పనులకు వెళ్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు.

అయితే ఇవాళ చింతలపల్లిలో మిత్రులతో కలిసి పనికి వచ్చాడు. శనగ కుప్పలను యంత్రంలో వేస్తుండగా ప్రమాదవశాత్తు జారి అందులో పడ్డాడు. గమనించిన డ్రైవర్ వెంటనే యంత్రాన్ని నిలిపినప్పటికీ ఖయ్యూం తల యంత్రంలో పడి పూర్తిగా నలిగిపోవడం వల్ల మృతి చెందాడు. సమచారం తెలుసుకున్న మిడుతూరు పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:చెడు వ్యసనాలకు బానిసైన యువకుడు.. ఉరేసుకుని ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details