ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / elections

'ఈసీ దారుణ వైఫల్యం... చరిత్రలో ప్రథమం'

సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఈసీ దారుణంగా వైఫల్యం చెందిందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. మోదీ, అమిత్​షా ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేశారని ఆరోపించారు.

By

Published : Apr 12, 2019, 11:59 PM IST

Updated : Apr 13, 2019, 12:59 AM IST

minister prathipati over elections


ఎన్నికల నిర్వహణలో జరిగిన ఇబ్బందులకు ఈసీ వైఫల్యమే కారణమని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఆరోపించారు. ప్రధాని మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్​షా.. ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేశారని విమర్శించారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ దారుణంగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు.

ప్రత్తిపాటి మీడియా సమావేశం

' ఎన్నికల నిర్వహణలో ఈసీ పూర్తిగా వైఫల్యం చెందింది. మోదీ, అమిత్ షా ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేశారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత ఎన్నికల పక్షపాతంగా జరగడం.. ఇదే మొదటిసారి. ఈవీఎంలో సాంకేతిక లోపాలు కుట్రలో భాగమే. వారంతా అధికార దుర్వినియోగం చేశారు. మహిళలంతా చంద్రబాబుకు మద్దతుగా ఓటు వేశారు. వైకాపా ఎన్ని దాడులు చేసినా..గరిష్ఠ స్థాయిలో పోలింగ్​ నమోదైంది.'
-- ప్రత్తిపాటి పుల్లారావు, రాష్ట్ర మంత్రి

ఇవీ చదవండి..వైకాపా నేత చెవిరెడ్డిపై పోలీసులకు నాని ఫిర్యాదు

Last Updated : Apr 13, 2019, 12:59 AM IST

ABOUT THE AUTHOR

...view details