ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 27, 2021, 12:22 PM IST

ETV Bharat / crime

పేలిన మూడు గ్యాస్ సిలిండర్లు... రెండు పూరిళ్లు దగ్ధం

ప్రమాద వశాత్తు మూడు గ్యాస్​ సిలిండర్లు పేలి రెండిళ్లు పూర్తిగా దగ్ధమైన ఘటన తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంలో రూ. 2.7 లక్షల నగదుతో పాటు ఇతర సామాన్లు కూడా కాలి బూడిదయ్యాయని బాధితులు వాపోయారు.

gas cylinders blast
గ్యాస్ సిలిండర్లు పేలి పూరిళ్లు దగ్ధం

గ్యాస్ సిలిండర్లు పేలి పూరిళ్లు దగ్ధం

తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం భీమవరం గ్రామంలోని ఎస్సీ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో మూడు గ్యాస్ సిలిండర్లు పేలగా.. రెండు పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన కోట నగేష్ అతని కుమారుల కుటుంబాలకు చెందిన ఇళ్లు మంటల్లో కాలిపోయాయి.

కూలి పనుల కోసం అందరూ బయటకు వెళ్లిన సమయంలో ప్రమాదం జరిగింది. ఒక సిలిండర్ పేలి దాని వెనక ఉన్న సిలిండర్లకు మంటలు అంటుకున్నాయి. ఇటీవల మిర్చి పంట విక్రయించగా వచ్చిన రూ. 2.7 లక్షల నగదుతో పాటు ద్విచక్ర వాహనం, ఇంట్లోని ఇతర సామాన్లు పూర్తిగా కాలిపోయాయని బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details