ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 28, 2021, 7:19 PM IST

ETV Bharat / city

శ్రీ రాధాకృష్ణ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా: ఎంపీ విజయసాయిరెడ్డి

విశాఖ బీచ్ రోడ్​లోని​ గోకుల్ పార్కులోని శ్రీరాధాకృష్ణ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ విజయసాయిరెడ్డి హామీ ఇచ్చారు. ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

 ఎంపీ విజయసాయి రెడ్డి
VijayaSaireddy Participate pooja at radha kridhna temple

విశాఖ బీచ్ రోడ్​లో గల గోకుల్ పార్కులోని శ్రీ రాధాకృష్ణ ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శ వి.విజయసాయిరెడ్డి (mp vijayasaireddy) పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. పార్కుతోపాటు ఆలయ ప్రాంగణ అభివృద్ధికి కృషిచేస్తామని విజయసాయి రెడ్డి హామీ ఇచ్చారు. యాదవ సామాజిక భవనం నిర్మాణం నిమిత్తం ఆరిలోవలో స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా యాదవ పెద్దలు, నాయకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details