ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'నిర్మాణాలకు' జీఎస్టీ తగ్గించాలి!

నిర్మాణ రంగానికి భారంగా మారిన జీఎస్టీ తగ్గింపునకు రాష్ట్ర ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని క్రెడాయ్ విశాఖ శాఖ నిర్ణయించింది. జిఎస్టీ తగ్గించాలన్న డిమాండ్​పై జిఎస్టీ కౌన్సిల్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరింది.

By

Published : Feb 23, 2019, 1:29 PM IST

క్రెడాయ్ ప్రతినిధుల సమావేశం

క్రెడాయ్ ప్రతినిధుల సమావేశం
నిర్మాణ రంగానికి భారంగా మారిన వస్తుసేవల పన్ను రేటుతగ్గింపునకు... రాష్ట్ర ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని క్రెడాయ్ విశాఖ శాఖ నిర్ణయించింది. ఈ డిమాండ్​పై జీఎస్టీ కౌన్సిల్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని సూచించింది. పుల్వామా దాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు ఆయా జిల్లాల్లో రెండు పడక గదుల ఫ్లాట్​లు కట్టించి ఇవ్వాలన్న... జాతీయ క్రెడాయ్ నిర్ణయానికి అనుగుణంగా తామూ సహాయం అందిస్తున్నట్టు వివరించింది. సిమెంట్ కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచడం వల్ల నిర్ణాణ రంగానికితీవ్ర విఘాతం కలుగుతోందని.. ఈ పరిణామాన్నివెంటనే సరిదిద్దుకోవాలని కోరింది. ఈ వ్యవహారంపై సర్వోన్నత న్యాయ స్ధానంలో కేసు నడుస్తోందని క్రెడాయ్ ప్రతినిధులు తెలిపారు.

ఇవీ చదవండి...రంగంలోకి రాజకీయ వారసులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details