లారీని ఢీకొన్న బస్సు... 12 మందికి తీవ్ర గాయాలు
రోడ్డు ప్రమాదంలో 12 మంది గాయపడ్డారు. 108 సిబ్బంది సమ్మె కారణంగా అంబులెన్స్లు రాలేదు. పోలీసులే తమ వాహనాల్లో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు
విశాఖ జిల్లా కశింకోట మండలంలోని ఎన్.జీ పాలెంలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. 108 సిబ్బంది సమ్మెలో ఉన్నందున క్షతగాత్రులను పోలీసు వాహనాల్లో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టటంతో ప్రమాదం జరిగింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు పలాస నుంచి విజయవాడ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.