ఏషియన్ గేమ్స్, ఒలింపిక్ పోటీల్లో కరాటేను క్రీడగా గుర్తించాలని భాజపా ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. విశాఖలో నిర్వహించిన రెండో రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్ షిప్ ముగింపునకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
విజేతలకు బహుమతులు అందజేశారు. అత్యంత ప్రతిభ కలిగిన కరాటే, మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులు రాష్ట్రంలో ఉన్నారని మాధవ్ పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.