ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 5,487 కరోనా కేసులు, 37 మరణాలు

By

Published : Sep 28, 2020, 7:18 PM IST

Updated : Sep 28, 2020, 8:20 PM IST

new-corona-cases-in-andhrapradhesh
రాష్ట్రంలో కొత్తగా 5,487కరోనా కేసులు, 37మరణాలు నమోదు

19:15 September 28

రాష్ట్రంలో కొత్తగా 5,487కరోనా కేసులు, 37 మరణాలు నమోదు

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 5,487మందికి కరోనా సోకినట్లు వైద్యాధికారులు తెలిపారు. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,81,161 కు చేరింది. వైరస్ కారణంగా మరో 37 మంది మరణించగా... మృతుల సంఖ్య 5,745 కి ఎగబాకింది. కరోనా నుంచి 6,12,300మంది కోలుకున్నారు. ప్రస్తుతం 63,116మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

జిల్లాల వారీగా కరోనా కేసులు...  

తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,010మంది కరోనా బారిన పడ్డారు. పశ్చిమగోదావరి జిల్లాలో 903, ప్రకాశంలో 634, చిత్తూరులో 329 మందికి వైరస్ సోకినట్లు వైద్యాధికారులు తెలిపారు. గుంటూరులో 538, నెల్లూరులో 489, శ్రీకాకుళంలో 286 కరోనా కేసులు వెలుగుచూశాయి. అనంతపురంలో 310, కడపలో 271, విజయనగరంలో 362, కృష్ణాలో 97, విశాఖలో 145, కర్నూలులో 113 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.

జిల్లాలో వారీగా కరోనా మృతులు...

ప్రకాశం జిల్లాలో ఏడుగురు మరణించగా... చిత్తూరు జిల్లాలో ఆరుగురు, కృష్ణాలో ఐదుగురు మృతి చెందారు. తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాలో నలుగురు చొప్పున, పశ్చిమగోదావరి, కడప జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృత్యువాతపడ్డారు. అనంతపురం, విశాఖలో ఇద్దరు చొప్పున మరణించగా... నెల్లూరు జిల్లాలో ఒకరు కన్నుమూశారు.

ఇదీ చదవండి:

ఇది ఉంటే కరెంటక్కర్లేదు.. పొలాల్లో నీరు గలగలా పారుతుంది!

Last Updated : Sep 28, 2020, 8:20 PM IST

ABOUT THE AUTHOR

...view details