ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'జిల్లాలో గజం భూమి కూడా కబ్జా కానివ్వను'

విశాఖ నగర అభివృద్ధిపై అధికారులతో మంత్రి అవంతి శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. నగరంలో జరుగుతున్న పనులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. భీమిలికి ఎమ్మెల్యేగా...జిల్లాలో మంత్రిగా ఉన్నంత కాలం ఒక్క గజం భూమి కూడా కబ్జా కానివ్వనని అవంతి వ్యాఖ్యానించారు.

By

Published : Jan 31, 2020, 5:36 PM IST

minister-avanthi-review-on-vishaka city
minister-avanthi-review-on-vishaka city

విశాఖ నగర అభివృద్ధిపై మంత్రి అవంతి సమీక్ష

భవిష్యత్తులో విశాఖ నగరాన్ని జోన్లుగా విభజించి అభివృద్ధి చేస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. సీఎం జగన్ విశాఖ పర్యటనలో గత నెలలో ప్రారంభించిన అభివృద్ధి పనులు జరుగుతున్న తీరుపై జీవీఎంసీ కార్యాలయంలో అధికారులతో మంత్రి సమీక్షించారు. 212 కోట్ల రూపాయల జీవీఎంసీ నిధులతో 1132 పనులు జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భీమిలికి ఎమ్మెల్యేగా.. జిల్లాలో మంత్రిగా ఉన్నంత కాలం.. ఒక్క గజం భూమి కూడా కబ్జా కానివ్వనని మంత్రి స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details