ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 5, 2021, 2:09 PM IST

ETV Bharat / city

విశాఖలో.. వైకాపాలో చేరిన ఇండిపెడెంట్ కార్పొరేటర్లు

విశాఖ మహానగరపాలక సంస్థ ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థులు నిలిచి గెలిచిన ముగ్గురు కార్పొరేటర్లు వైకాపాలో చేరారు. ఎంపీ విజయసాయి కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

independent candidates joined ysrcp
వైకాపాలో చేరిన ఇండిపెడెంట్ కార్పొరేటర్లు

విశాఖ మహానగరపాలక సంస్థ ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన ముగ్గురు కార్పొరేటర్లు వైకాపాలో చేరారు. విశాఖ 32 వ డివిజన్ కార్పొరేటర్ కందుల నాగరాజు, 35 వ డివిజన్ కార్పొరేటర్ విల్లురి భాస్కరరావు, 39 వ డివిజన్ కార్పొరేటర్ మహ్మద్ సాధిక్ లు అధికార పార్టీకి తమ మద్దతు తెలిపారు.

తిమ్మాపురంలోని అతిథి గృహంలో.. ముగ్గురు కార్పొరేటర్లను ఎంపీ విజయసాయిరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డివిజన్ అభివృద్ధిలో జగన్ ఆశయాలతో పనిచేస్తామని కార్పొరేటర్లు స్పష్టం చేశారు. వీరిలో ఇద్దరు వైకాపా నుంచి టికెట్ ఆశించి భంగపడి ఇండిపెండెంట్​గా ఎన్నికల బరిలో నిలిచిన వారు కావడం విశేషం.

ABOUT THE AUTHOR

...view details