ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 17, 2021, 11:59 AM IST

ETV Bharat / city

ఇత్తడి పేరుతో ఇంట్లోకెళ్లి.. మెడలోని పుత్తడి దోచేశారు!

విశాఖలోని గాజువాకలో ఇద్దరు దొంగలు ఇత్తడి అమ్ముతామంటూ ఓ ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లోని వారిపై దాడి చేసి బంగారంతో ఉడాయించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.

gold robbery at vishakapatnam gajuwaka
మెడలోని పుత్తడి దోచేశారు దొంగలు

విశాఖ గాజువాకలోని హైస్కూల్ రోడ్ లో దుండగులు రెచ్చిపోయారు. మాయమాటలతో ఓ ఇంట్లో చొరబడి.. భార్యాభర్తలపై దాడి చేశారు. బంగారు ఆభరణాలను తస్కరించారు. ఇత్తడి అమ్మడానికి వచ్చామన్న ఆ ఇద్దరు.. ఒక్కసారిగా ఇంట్లోని వారిపై దాడి చేశారు. వారి మెడలోని సుమారు 4 తులాల బంగారాన్ని అపహరించి పరారయ్యారు.

ఈ దాడిలో గాయపడిన మహిళను చికిత్స కోసం పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన గాజువాక క్రైమ్ పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details