ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 2, 2021, 9:37 AM IST

ETV Bharat / city

విక్టరీ ఎట్ సీ వద్ద తూర్పునౌకాదళాధిపతి నివాళులు

విశాఖపట్నం ఆర్కే బీచ్​లో ఉన్న విక్టరీ ఎట్ సీ వద్ద... అమరులైన రక్షణదళాల సిబ్బందికి తూర్పు నౌకాదళ నూతన అధిపతి, వైస్ అడ్మిరల్ ఏబీ సింగ్ నివాళులు అర్పించారు.

Eastern Naval Command Tribute at Victory at Sea
విక్టరీ ఎట్ సీ వద్ద తూర్పునౌకాదళాధిపతి నివాళులు

తూర్పు నౌకాదళాధిపతిగా బాధ్యతలను చేపట్టిన వైస్ అడ్మిరల్ ఏబీ సింగ్... ఆర్కే బీచ్​లో ఉన్న విక్టరీ ఎట్ సీ వద్ద అమరులైన రక్షణదళాల సిబ్బందికి నివాళులు అర్పించారు. 1971 లో పాకిస్థాన్‌పై జరిగిన యుద్ధంలో విజయానికి గుర్తుగా .. అమర జవాన్లు, నావికా సిబ్బంది ఇతర రక్షణ రంగ సిబ్బందిని గుర్తు చేసుకుంటూ ఈ స్మారకం విశాఖలో నిర్మించారు.

ప్రతి జాతీయ పండుగల రోజున, తూర్పు నౌకాదళాధిపతి ఈ తరహాలోనే వచ్చి నివాళులు అర్పించి వారి సేవలను స్మరించుకోవడం ఆనవాయితీ. కొత్తగా బాధ్యతలను చేపట్టిన తూర్పు నౌకాదళాధిపతి కూడా ఈ సంప్రదాయం కొనసాగించారు.

ABOUT THE AUTHOR

...view details