ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అనాథ పిల్లల మధ్య అవంతి సంబరాలు

భీమిలీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక అవంతి శ్రీనివాస్​ తన సంబరాలను ఎస్​ఓఎస్​ అనాథ పిల్లలతో జరుపుకున్నారు.

By

Published : May 24, 2019, 1:10 PM IST

అనాథ పిల్లలతో అవంతి సంబరాలు

భీమిలి శాసనసభ్యుడిగా ఎన్నికైన అవంతి శ్రీనివాస్ ప్రజాసమస్యలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. భీమిలి శాసనసభ్యుడిగా ఆయన ఎన్నిక ఖరారయ్యాక భీమిలి నియోజకవర్గంలో కార్యకర్తలు సంబరాలు జరుపుకొన్నారు. ఇవాళ ఉదయం భీమిలిలోని శ్రీ నూకాలమ్మ ఆలయంలో ముత్తంశెట్టి శ్రీనివాస్​ పూజలు నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ భీమిలిలోని ఎస్ఓఎస్ అనాథ బాలికల ఆశ్రమం పిల్లలతో సమావేశమయ్యారు. అనాథ పిల్లలను అక్కున చేర్చుకొని ఆదరిస్తున్న ఎస్​ఓఎస్ విలేజ్​కు సహాయ సహకారాలు అందిస్తానని అవంతి తెలిపారు.

అనాథ పిల్లలతో అవంతి సంబరాలు

ABOUT THE AUTHOR

...view details