ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మద్య నిషేధాన్ని అమలు చేయండి: మహిళాసంఘాలు

నేషనల్ హైవేలపై మద్యం దుకాణాలను తొలగించాలని మహిళా సంఘం నేతలు విజయవాడలో డిమాండ్ చేశారు. ఎన్నికల హామీల్లో చెప్పిన విధంగా సంపూర్ణ మద్యపాన నిషేదాన్ని వెంటనే అమలు చేయాలని సీఎం జగన్ కు విజ్ఞప్తి చేశారు.

By

Published : Jun 23, 2019, 9:11 AM IST

Updated : Jun 23, 2019, 1:32 PM IST

మద్యపాన నిషేదాన్ని వెంటనే అమలు చేయండి: మహిళాసంఘాలు

మద్యపాన నిషేదాన్ని వెంటనే అమలు చేయండి: మహిళాసంఘాలు

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాటిలో... 25 శాతం మద్యం దుకాణాల లైసెన్సులను తక్షణమే రద్దు చేయాలని మహిళలు డిమాండ్ చేశారు. ప్రజాసంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో మహిళలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సుప్రీం కోర్టు ఉత్తర్వులను అనుసరించి హైవేల పక్కన ఉన్న మద్యం దుకాణాలను మూసివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన విధంగా దశలవారీ మద్యపాన నిషేధాన్ని తక్షణమే అమల్లోకి తేవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Last Updated : Jun 23, 2019, 1:32 PM IST

ABOUT THE AUTHOR

...view details