ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్ర అవతరణ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్సవాన్ని న‌వంబ‌ర్ 1న నిర్వహించాల‌ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో ఉన్నతాధికారులు సమావేశమై అవతరణ దినోత్సవ నిర్వహణపై సచివాలయంలో సమీక్షించారు.

By

Published : Oct 22, 2019, 6:16 AM IST

Published : Oct 22, 2019, 6:16 AM IST

రాష్ట్ర అవతరణ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించడంతో అందుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. విజ‌య‌వాడ‌లోని తుమ్మల‌ప‌ల్లి క‌ళాక్షేత్రంలో అధికారికంగా అవ‌త‌ర‌ణ దినోత్సవ వేడుక‌ల‌ను నిర్వహించనున్నారు. రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్సవ నిర్వహ‌ణ తేదిపై త‌ర్జన‌భ‌ర్జన‌లు జ‌రిగిన‌ప్పటికీ కేంద్ర హోంశాఖ సూచ‌న‌ల మేర‌కు న‌వంబ‌ర్ 1నే నిర్వహించాల‌ని నిర్ణయించారు. విభ‌జ‌న చ‌ట్టంలోనూ ఏపీని రెసిడ్యూరీ స్టేట్‌గానే పేర్కొన‌డంతో ఇదే తేదీని రాష్ట్ర అవతరణ దినోత్సవంగా నిర్వహించటం సమంజసమని ప్రభుత్వం భావిస్తోంది.

ఆరేళ్ళ విరామం అనంతరం, రాష్ట్ర విభజన తర్వాత జరుగుతున్న తొలి వేడుకలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. దీనికోసం సాధ‌ర‌ణ ప‌రిపాల‌న శాఖ ఏర్పాట్లు చేస్తోంది. అన్ని జిల్లాల్లోనూ రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు.

నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరిపేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం తొలిసారి జరుపుకోబోయే ఈ వేడుకలను విజయవాడలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.ఆరేళ్ల విరామం అనంతరం ఈ వేడుకలు జరగనుండటం విశేషం.

రాష్ట్ర అవతరణ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

ఇదీచదవండి

గిరిజన ప్రాంత అభివృద్ధిపై దృష్టిపెట్టాలి : సీఎస్

ABOUT THE AUTHOR

...view details