జగన్ అరచేతిలో కైలాసం చూపిస్తున్నారని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని మార్పు చారిత్రక తప్పిదమని, తుగ్లక్ చర్యగా పేర్కొన్నారు. జగన్ ఆలోచన ఆచరణ సాధ్యం కాదని.. విఫలం చెందుతుందుతారని అభిప్రాయపడ్డారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. విశాఖపట్టణాన్ని ఆర్థిక, సినిమా, ఐటీ రాజధానిగా చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు.
జగన్ పదవీచ్యుతుడు అవుతాడు: తులసిరెడ్డి
ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇద్దరూ రాహుకేతువుల్లా తయారయ్యారని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శించారు. రాజధాని మార్పుపై ఆయన స్పందించారు.
జగన్ పదవీచ్యుతుడు అవుతాడు:తులసిరెడ్డి