ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @3pm

...

By

Published : Jun 7, 2020, 3:06 PM IST

top news @ 3pm
ప్రధాన వార్తలు @3pm

  • బడి గంట మోగేదెప్పుడు..?

కరోనా కాటు నుంచి బడి పిల్లలను ఇన్నాళ్లుగా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. ఇక లాక్‌డౌన్‌ సడలింపులు ఇవ్వడంతో త్వరలోనే పాఠశాలలు కూడా తెరుచుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • బిందె నీటి కోసం 15 కిలోమీటర్లు ప్రయాణం

తీవ్ర నీటి ఎద్దడితో కృష్ణా జిల్లా బసవవానిపాలెం గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచినీటి కోసం 15 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. అధికారులు ఇకనైనా స్పందించి తమ నీటి కష్టాలను తీర్చాలని వేడుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కళేబరమయ్యావా తల్లీ!

చిన్నప్ప... సన్నకారు రైతు. పాడితో అంతో ఇంతో ఆదాయం వస్తుందని ఓ ఆవును పోషిస్తున్నారు. ఇటీవల అది చూడికి వచ్చింది. అప్పటి నుంచి మరింత శ్రద్ధ చూపుతూ కంటికి రెప్పలా కాపాడుతున్నారు. చెంగుచెంగున పరుగులెత్తే లేగదూడ తన ఇంటికి వస్తుందని మురిసిపోయారు. కానీ అతని ఆనందం ఎన్నో రోజులు ఉండలేదు. అనుకోని ఘటన విషాదాన్ని మిగిల్చింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కష్టాల్ని దున్నేసింది!

ఒడిశాలో ఓ మారుమూల గ్రామంలోని గిరిజన మహిళ ఇప్పుడు ఆత్మస్థైర్యానికి కేరాఫ్​గా మారింది. విధి పెట్టిన పరీక్షలకు వెనకడుగు వేయక.. కష్టాల ఊబి నుంచి బయటపడే మార్గం వెతికింది. తన బిడ్డల ఆకలి తీర్చేందుకు ట్రాక్టర్​ స్టీరింగ్​ చేతబట్టి, డ్రైవర్​గా మారింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • నిందితుడి ఇల్లు కూల్చేసిన జనం!

మధ్యప్రదేశ్​లోని నౌగావ్​​ ప్రాంతంలో ఓ అత్యాచార నిందితుడి ఇంటిని కూల్చేశారు స్థానికులు. అయితే ఈ ఇల్లు అక్రమ కట్టడమని స్పష్టం చేశారు అదనపు జిల్లా మెజిస్ట్రేట్​. ప్రస్తుతం ఆ అత్యాచార నిందుతుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆసుపత్రికి వచ్చిన వానరం

గాయపడిన ఓ కోతి చికిత్స చేయించుకోవటానికి నర్సింగ్​ హోంకు వచ్చిన ఘటన కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లా డాండేలీలో జరిగింది. ముందు కోతిని చూసి భయపడిన సిబ్బంది.. ఆ తర్వాత గాయపడినట్లు గుర్తించి చికిత్స చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అడవే దిక్కైంది!

కరోనా మహమ్మారి వెంటాడుతుందనే భయంతో ఓ వ్యక్తిని తన సొంతూళ్లోకి రాకుండా అడ్డుకున్నారు గ్రామస్థులు. క్వారంటైన్​ గురించి తెలియని ఆ వ్యక్తి.. ఇక అరణ్యమే దిక్కనుకున్నాడు. రెండు రోజులపాటు అడవిలోనే గడిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • నిజాలతో చైనా శ్వేతపత్రం

కరోనా మహమ్మారి వ్యాప్తి గురించి చైనా ఓ శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. కావాలనే ఈ వైరస్ గురించి ప్రపంచానికి తెలియకుండా చేయడానికి చైనా ప్రయత్నించిందన్న ఆరోపణలను ఖండించింది. తాము వైరస్​ను కట్టడి చేసేందుకు శాయశక్తులా కృషి చేశామని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • విమానాశ్రయంలోనే ఫుట్​బాల్ ప్లేయర్

కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా విధించిన లాక్​డౌన్​తో ఓ విదేశీ ఫుట్​బాల్​ ప్లేయర్​ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఏకంగా 74 రోజులుగా ముంబయి విమానాశ్రయంలో ఉండిపోయాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వసూళ్ల రాణీ

'ఝుమ్మంది నాదం' సినిమాతో టాలీవుడ్​ తెరపై ఎంట్రీ ఇచ్చిన తాప్సీ.. ఆ తర్వాత కమర్షియల్​, గ్లామర్​ చిత్రాలు రావడం వల్ల పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయారు. అనూహ్యంగా బాలీవుడ్​లో అడుగుపెట్టిన ఈ భామకు.. నటనా, నాయికా ప్రాధాన్యమున్న పాత్రలు రావడం వల్ల అక్కడే సెటిల్​ అయిపోయారు. ప్రస్తుతం 'కలెక్షన్​ క్వీన్'​గా దూసుకెళ్తున్న ఈ భామ.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details