ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @11 AM

ప్రధాన వార్తలు @11 AM

By

Published : May 18, 2021, 11:00 AM IST

TOP NEWS @11AM
ప్రధాన వార్తలు @ 11 AM

  • రఘురామకు వైద్య పరీక్షలు ప్రారంభం

ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ప్రత్యేక మెడికల్ బోర్డు, న్యాయాధికారి పర్యవేక్షిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'బ్లాక్‌ ఫంగస్‌ కేసులొస్తే.. సమాచారమివ్వాలి'

కరోనాతో మృతి చెందిన వారి పిల్లలకు అండగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కరోనా కాలంలోనూ.. చుక్క పడాల్సిందే..!

కరోనా సమయంలోనూ లిక్కరు కిక్కుకోసం మందుబాబులు పరితపిస్తున్నారు. కర్ఫ్యూ ఆంక్షలు ఉన్నప్పటికీ తమపని తాము చేసుకుపోతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'టెలీమెడిసిన్‌ ద్వారా కరోనా రోగులకు వైద్యం'

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 10 వేల మందికి వైద్య సేవలందించడం లక్ష్యం ముందుకెళుతున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు వెల్లడించారు. దీనికోసం వైద్య నిపుణులతో చర్చించేందుకు వెబినార్‌ నిర్వహించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • యువత వ్యవసాయాన్ని అందిపుచ్చుకుంటే తిరుగుండదు: నాబార్డు ఛైర్మన్​

యువత వ్యవసాయాన్ని అందిపుచ్చుకుంటే తిరుగు ఉండదని నాబార్డు ఛైర్మన్​ డాక్టర్​ చింతల గోవిందరాజులు అన్నారు. వ్యవసాయాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్ది యువత, పట్టభద్రులను ఆ దిశగా మళ్లించేందుకు నాబార్డు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుందన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 3డీ ప్రింటెడ్​ బయోరియాక్టర్​ను రూపొందించిన ఐఐటీ

కణాలపై పరిశోధనకు సంబంధించి ఐఐటీ మద్రాస్​కు చెందిన శాస్త్రవేత్తలు కొత్త సాంకేతికతను కనుగొన్నారు. అమెరికాకు చెందిన మసాచుసెట్స్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ శాస్త్రవేత్తల సాయంతో 3డీ ప్రింటెడ్​ బయోరియాక్టర్​ను రూపొందించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బైడెన్ కంటే కమల సంపాదనే ఎక్కువ

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదాయం కన్నా.. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ దాదాపు 3రెట్లు ఎక్కువగా సంపాదిస్తున్నారు. తాజాగా వారు వెల్లడించిన ఆదాయ పన్ను వివరాలు స్పష్టం చేశాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భారీ లాభాల్లో ​మార్కెట్లు- 50వేల మార్క్​ దాటిన సెన్సెక్స్​

స్టాక్​మార్కెట్లు మంగళవారం సెషన్​ను లాభాలతో ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 512పాయింట్లకు పైగా లాభపడి50,092 వద్ద కొనసాగుతుంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 169 పాయింట్లకు వృద్ధి చెంది15,092 వద్ద ట్రేడవుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'వాన్​ దిగజారుడు స్వభావానికి ఇది నిదర్శనం'

ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్, పాక్ క్రికెటర్ సల్మాన్ బట్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా బట్​ ఫిక్సింగ్ విషయంపై వాన్ చేసిన వ్యాఖ్యలు పలువురి విమర్శలకు కారణమయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బ్రహ్మానందం కాల్​ చేస్తే కట్​ చేశా: నిరుపమ్

ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ టాక్ షో 'ఆలీతో సరదాగా'కు ఈ వారం బుల్లితెర జోడీ నిరుపమ్, మంజుల విచ్చేసి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details