విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఈ ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. అమ్మవారికి పవిత్ర మాలధారణ, ప్రత్యేక పూజల అనంతరం దర్శనానికి భక్తులకు అనుమతి ఇచ్చారు.
ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈనెల 23న మహా పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. ఈ సందర్భంగా దేవస్ధానంలో జరిగే అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసినట్టు ఆలయ సిబ్బంది ప్రకటించారు. ఉత్సవాలకు అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు.