ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కనకదుర్గమ్మ ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం

ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈనెల 23న మహా పూర్ణాహుతితో కార్యక్రమాలు ముగియనున్నాయి.

By

Published : Aug 21, 2021, 3:25 PM IST

Updated : Aug 21, 2021, 3:33 PM IST

కనకదుర్గమ్మ
కనకదుర్గమ్మ

కనకదుర్గమ్మ ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఈ ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. అమ్మవారికి పవిత్ర మాలధారణ, ప్రత్యేక పూజల అనంతరం దర్శనానికి భక్తులకు అనుమతి ఇచ్చారు.

ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈనెల 23న మహా పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. ఈ సందర్భంగా దేవస్ధానంలో జరిగే అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసినట్టు ఆలయ సిబ్బంది ప్రకటించారు. ఉత్సవాలకు అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు.

Last Updated : Aug 21, 2021, 3:33 PM IST

ABOUT THE AUTHOR

...view details