ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 5, 2021, 6:44 PM IST

ETV Bharat / city

'డ్వాక్రా సంఘాల నిధుల్ని ఇతర పథకాలకు మళ్లిస్తే ఊరుకోం'

డ్వాక్రా సంఘాల నిధుల్ని మళ్లించేందుకు ముఖ్యమంత్రి జగన్​ ప్రయత్నిస్తున్నారని తెదేపా అంగన్​వాడీ వర్కర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

achanta sunitha
తెదేపా మహిళ నాయకురాలు ఆచంట సునీత

జగనన్న ఇళ్ల నిర్మాణాలకు డ్వాక్రా సంఘాల నిధుల్ని మళ్లిస్తే ఊరుకోబోమని తెదేపా అంగన్​వాడీ వర్కర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత స్పష్టం చేశారు. మొండి బకాయిలుగా మారితే డ్వాక్రా సంఘాల మనుగడకే ప్రమాదమని ఆమె హెచ్చరించారు. డ్వాక్రా సంఘాల ఏర్పాటుతో మహిళల అభివృద్ధికి తెదేపా అధినేత చంద్రబాబు కృషిచేస్తే.. ఆ నిధుల్ని మళ్లించేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దశాబ్ధాలుగా మహిళలు దాచుకున్న సొమ్మును ముట్టుకునే హక్కు మీకెవరిచ్చారని ప్రశ్నించారు.

జగనన్న కాలనీలు నిర్మిస్తామని గొప్పలు చెప్పుకుంటూ ప్రజల నెత్తిన పిడిగుద్దులు గుద్దుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చే అరకొర సొమ్ముతో ఇల్లు కట్టుకోలేమని లబ్ధిదారులు చేతులెత్తేస్తున్నారని.. ఈ క్రమలో డ్వాక్రా సంఘాలల్లో వివాదాలు పెట్టేందుకు జగన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి జగన్ విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details