ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 30, 2022, 9:09 PM IST

ETV Bharat / city

మైలవరాన్ని రెవిన్యూ డివిజన్​గా ప్రకటించాలని దేవినేని ఉమ రాస్తారోకో... అరెస్ట్​

TDP Leader Devineni Mma Arrest at Mylavaram: మైలవరాన్ని రెవిన్యూ డివిజన్​గా ప్రకటించాలని కోరుతూ రాస్తారోకో నిర్వహించిన మాజీ మంత్రి దేవినేని ఉమను మైలవరం పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్‌స్టేషన్‌ వద్ద బైఠాయించిన తెదేపా శ్రేణులు.. దేవినేని ఉమను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

devineni uma arrest at mylavaram
మైలవరంలో దేవినేని ఉమా అరెస్టు

Devineni Mma Arrest at Mylavaram: కృష్ణా జిల్లా మైలవరంలో రోడ్డుపై రాస్తారోకో నిర్వహించిన మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు అరెస్టు చేశారు. మైలవరాన్ని రెవిన్యూ డివిజన్​గా ప్రకటించాలని డిమాండ్​ చేస్తూ.. మైలవరం రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో దేవిని ఉమ ఆందోళన చేపట్టారు. దీంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. రహదారిపై ట్రాఫిక్​ నిలిచిపోవడంతో దేవినేని ఉమను అరెస్టు చేసి మైలవరం పీఎస్‌కు తరలించారు. దీంతో పోలీస్‌స్టేషన్‌ వద్ద బైఠాయించిన తెదేపా శ్రేణులు.. దేవినేనిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details