ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 9, 2021, 2:06 PM IST

ETV Bharat / city

హోరాహోరీ పోరులో బెజవాడ పీఠం.. పోలింగ్​కు సర్వం సిద్ధం

బెజవాడ నగరపాలక పోరుకు సర్వం సిద్ధం అయింది. ఎన్నికల ప్రచారం ముగియటంతో అధికార యంత్రాంగం సామాగ్రి పంపిణిలో నిమగ్నమయ్యారు. ఈ ఏర్పాట్లపై ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేశ్​తో ఈటీవీ భారత్​ ప్రత్యేక ముఖాముఖి.

vijayawada Comissioner
బెజవాడ పీఠం పోరుకు ఏర్పాట్లు..

బెజవాడ పీఠం పోరుకు ఏర్పాట్లు..

పురపోరుకు బెజవాడ సిద్ధమైంది. నిన్నటితో ఎన్నికలకు సంబంధించి ప్రచార పర్వం పూర్తయింది. ఇక అధికార యంత్రాంగం.. బుధవారం నిర్వహించనున్న ఎన్నికల కోసం అవసరమైన సామగ్రిని అందించటంలో నిమగ్నమైంది. ఈ మేరకు ఇందిరాగాంధీ మున్సిపల్‌ క్రీడా ప్రాంగణంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.

రేపు ఉదయం 7గంటల నుంచి ప్రారంభం కానున్న ఓటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. విజయవాడ నగరపాలక కమిషనర్ ప్రసన్న వెంకటేశ్​. ఈ ఏర్పాట్లపై ఆయనతో ఈటీవీ భారత్​ ప్రత్యేక ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details