ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 10, 2021, 9:29 AM IST

ETV Bharat / city

'ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశాం.. స్వేచ్ఛగా ఓటేయండి'

విజయవాడలో పోలింగ్‌ కేంద్రాల ఏర్పాట్లను ఎస్‌ఈసీ పరిశీలిస్తున్నారు. సీవీఆర్ స్కూల్ ఆవరణలోని 4వ పోలింగ్ కేంద్రం లో ఓటింగ్ సరళిని ఎన్నికల కమిషనర్ పరిశీలించారు. రాజ్యాంగ బద్ధ హక్కును అందరూ వినియోగించుకోవాలని ఎస్​ఈసీ సూచించారు.

sec nimmagada ramesh kumar inspect polling center at vijaywada
sec nimmagada ramesh kumar inspect polling center at vijaywada

విజయవాడలో పోలింగ్‌ కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించిన ఎస్‌ఈసీ

కృష్ణా జిల్లాలో మున్సిపల్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెట్టింది. విజయవాడలో పోలింగ్ ప్రక్రియను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సీవీఆర్ స్కూల్ ఆవరణలోని 4వ పోలింగ్ కేంద్రం లో ఓటింగ్ సరళిని ఎన్నికల కమిషనర్ పరిశీలించారు. అక్కడే ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్​తో కలిసి పరిశీలించారు. ఈ రోజు సాయంత్రం వరకు విజయవాడ నగరంలో పలు పోలింగ్ కేంద్రాలను ఎస్ఈసీ ఆకస్మిక తనిఖీ చేయనున్నారు.

'ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చేశాం. ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా పరిస్థితులు కల్పించాం. రాజ్యాంగ బద్ధ హక్కును వినియోగించుకోవాలి.' -ఎస్‌ఈసీ రమేశ్‌ కుమార్‌

ABOUT THE AUTHOR

...view details