దసరా నవరాత్రులు సందర్భాన్ని పురష్కరించుకుని ఎస్బీ అమరావతి సర్కిల్ తరఫున విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి భక్తుల సౌకర్యార్థం బస్సు అందించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ పి.శివకుమార్ బస్సు తాళాలను దేవస్థానం పాలకమండలి ఛైర్మన్ పైలా స్వామినాయుడు, కార్యనిర్వాహణాధికారి సురేష్బాబుకు అందజేశారు.
విజయవాడ దుర్గమ్మ దేవస్థానానికి ఎస్బీఐ బస్సు వితరణ
విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి ఎస్బీఐ అమరావతి సర్కిల్ తరఫున బస్సును విరాళంగా అందించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ పి.శివకుమార్ బస్సు తాళాలను దేవస్థానం పాలకమండలి ఛైర్మన్ పైలా స్వామినాయుడుకు అందజేశారు.
![విజయవాడ దుర్గమ్మ దేవస్థానానికి ఎస్బీఐ బస్సు వితరణ Sbi donation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9211911-775-9211911-1602936069628.jpg)
Sbi donation
27 సీట్లు కలిగిన మినీ బస్సును అందించి ఈ మహత్కార్యంలో సహకరించినందుకు ఆలయ పాలకమండలి తరఫున ఛైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి :రైల్వే గేటుతో తంటా... పరిష్కారం ఎప్పుడంటా..?