Pawan kalyan fires on YSRCP: ఉద్యోగులు తమకు రావాల్సిందే అడుగుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఉద్యోగులు ఆందోళన చేస్తే జనసేనపై విమర్శలు సరికాదని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం ఏం చేసినా.. డూడూ బసవన్నలా తల ఊపాలా? అని ధ్వజమెత్తారు జనసేనాని.
ప్రభుత్వం పద్ధతిగా ఉంటే ఉద్యోగులు రోడ్లపైకి ఎందుకొస్తారు. మంత్రులు అందరూ ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. ప్రభుత్వం మరింత సమర్థంగా పనిచేయాలని కోరుకుంటాం. ఉద్యోగులకు న్యాయం జరగాలనే మా మద్దతు తెలిపాం -పవన్ కల్యాణ్, జనసేన అధినేత