ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 22, 2022, 8:02 PM IST

ETV Bharat / city

Online classes in schools:ఈ నెల 24వ తేదీ నుంచి ఆన్​లైన్ తరగతులు

Online classes in schools: తెలంగాణలోని ఉన్నత తరగతుల విద్యార్థులకు ఈ నెల 24వ తేదీ నుంచి ఆన్​లైన్ మాధ్యమం ద్వారా బోధన నిర్వహించాలని ఆ రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది.

ఈ నెల 24వ తేదీ నుంచి ఆన్​లైన్ తరగతులు
ఈ నెల 24వ తేదీ నుంచి ఆన్​లైన్ తరగతులు

Online classes in schools: తెలంగాణలోని ఉన్నత తరగతుల విద్యార్థులకు ఈ నెల 24వ తేదీ నుంచి ఆన్​లైన్ మాధ్యమం ద్వారా బోధన నిర్వహించాలని ఆ రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలో కొవిడ్ ఉద్ధృతి దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ఈ నెల 30వరకు సెలవులు పొడిగించిన నేపథ్యంలో.. ఎనిమిది, తొమ్మిది, పదో తరగతుల విద్యార్థులకు ఆన్​లైన్, దూర విద్య ద్వారానే బోధన నిర్వహించాలని విద్యాశాఖ స్పష్టం చేసింది.

పాఠశాలలకు హాజరయ్యే ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది సైతం రొటేషనల్ బేసిస్​లో 50 శాతం మాత్రమే హాజరు కావాలని తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలన్ని అమలయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో..

సంక్రాంతికి 16 వరకు విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులివ్వగా.. ఈ సమయంలో కరోనా వ్యాప్తి ఉద్ధృతమైంది. ఇక చేసేదేమీ లేక.. సెలవులను ఈ నెల 30వరకు పొడిగించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యాసంస్థల్లో కొంతకాలం ప్రత్యక్ష తరగతులు నిర్వహించరాదని వైద్యారోగ్య శాఖ.. ప్రభుత్వానికి సిఫార్సు చేయగా... సెలవులు పొడిగించారు. సిలబస్​ను కూడా పరిగణలోకి తీసుకున్న విద్యాశాఖ.. ఇప్పుడు సెలవుల్లో కూడా ఆన్​లైన్​ ద్వారా తరగతులు నిర్వహించేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ఇవీ చూడండి:

MP RRR: నాపై వేటు వేయించలేమని చెప్పండి.. తక్షణం రాజీనామా చేస్తా - ఎంపీ రఘురామ

ABOUT THE AUTHOR

...view details