ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 22, 2020, 12:31 PM IST

ETV Bharat / city

'అమరావతి నిర్మాణం కొనసాగి ఉంటే.. పండుగ వాతావరణం ఉండేది'

అమరావతి నిర్మాణం కొనసాగివుంటే ఈరోజు రాష్ట్రమంతా పండుగ వాతావరణం ఉండేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ప్రజలకు ఆ సంతోషం లేకుండా చేసిన జగన్ తమ 'విషపునీయత' చూపించుకున్నారని విమర్శించారు.

'అమరావతి నిర్మాణం కొనసాగి ఉంటే.. పండుగ వాతావరణం ఉండేది'
'అమరావతి నిర్మాణం కొనసాగి ఉంటే.. పండుగ వాతావరణం ఉండేది'

ప్రజలంతా ఒక్కటిగా అమరావతిని కాపాడుకుందామని నారా లోకేశ్ పిలుపునిచ్చారు. దేశం గర్వపడే స్థాయిలో నూతన రాజధానిని కట్టుకుంటున్నారని దేశ ప్రధానితో సహా పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం వచ్చి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ఆంధ్రులను అభినందించారని గుర్తుచేశారు. అప్పటి ప్రతిపక్ష నాయకుడు మాత్రం ఇంట్లో కూర్చుని విధ్వంసకర ఆలోచనలు చేశారని విమర్శించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details