ఎన్నికల కమిషనర్కు సహకరించే ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు రాజ్యాంగ ఉల్లంఘనేనంటూ ఎమ్మెల్సీ అశోక్ బాబు ధ్వజమెత్తారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారులను బహిరంగంగా బెదిరించినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
హింసాయుతంగా బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడుతూ.. రాత్రింబవళ్లు రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తున్న అధికారులను అవమానించటం దుర్మార్గమన్నారు. ఒక మంత్రి ప్రభుత్వ అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లపై దాడికి పాల్పడుతుంటే ఉద్యోగ సంఘాల నాయకులు ఎందుకు నోరు మెదపడంలేదని నిలదీశారు.
ఆలయ మర్యాదలు చేస్తే బదిలీ వేటా..