ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పెద్దిరెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్​ చేయాలి: అశోక్​బాబు

ఎన్నికల కమిషనర్​కు సహకరించే ఉద్యోగులపై చర్య తీసుకుంటామని పెద్దిరెడ్డి వ్యాఖ్యలు రాజ్యాంగ ఉల్లంఘనేనని ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. బహిరంగంగా బెదిరింపులకు పాల్పడినందుకు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

By

Published : Feb 5, 2021, 11:01 PM IST

mlc ashock babu comments on peddireddy
పెద్దిరెడ్డిని మంత్రి వర్గం నుంచి బర్తరఫ్​ చేయండి: అశోక్ బాబు

ఎన్నికల కమిషనర్​కు సహకరించే ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు రాజ్యాంగ ఉల్లంఘనేనంటూ ఎమ్మెల్సీ అశోక్ బాబు ధ్వజమెత్తారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వ అధికారులను బహిరంగంగా బెదిరించినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

హింసాయుతంగా బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడుతూ.. రాత్రింబవళ్లు రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తున్న అధికారులను అవమానించటం దుర్మార్గమన్నారు. ఒక మంత్రి ప్రభుత్వ అధికారులు, ఐఏఎస్​లు, ఐపీఎస్​లపై దాడికి పాల్పడుతుంటే ఉద్యోగ సంఘాల నాయకులు ఎందుకు నోరు మెదపడంలేదని నిలదీశారు.

ఆలయ మర్యాదలు చేస్తే బదిలీ వేటా..

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్​ కుమార్​కు ఆలయ మర్యాదలు చేశారనే అక్కసుతోనే తిరుపతి జేఈవో బసంత్ కుమార్​పై బదిలీ వేటు వేశారని టీఎన్ఎస్ఎఫ్ జాతీయ సమన్వయకర్త రవి నాయుడు మండిపడ్డారు. దేవస్థానానికి ఉన్నతాధికారి వస్తే స్వాగతం అనే సంప్రదాయం అనాదిగా వస్తోందన్నారు. అందుకనుగుణంగానే పద్మావతి అమ్మవారి గుడిలో రమేష్ కుమార్​కు మర్యాదలు చేశారని.. కానీ కక్ష సాధింపులో భాగంగా జేఈవోపై ప్రభుత్వం బదిలీ వేటు వేయటం అహంకారానికి నిదర్శనమన్నారు.

ఇదీ చదవండి:

ఏపీలో రూ.40వేల కోట్లతో 3,787 కిలోమీటర్ల డబ్లింగ్‌ పనులు: రైల్వే మంత్రి

ABOUT THE AUTHOR

...view details