ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 13, 2021, 4:44 PM IST

ETV Bharat / city

మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వెల్లంపల్లి

సమాజంలో ప్రతి ఒక్కరి జీవితంపై ప్రభావం చూపిన కరోనాని, మనిషిలోని చెడును తగలబెట్టి మంచిని.. నిర్మించటమే ఈ భోగిమంటల అంతరార్థమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

Minister Vellampally wished Makar Sankranti
మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వెల్లంపల్లి

కరోనా చేదు జ్ఞాపకాలను భోగిమంటలలో వేసి.. తీపి గుర్తులతో సంక్రాంతి పండగకు ఆహ్వానం పలుకుదామని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడలో భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

సమాజంలోని ప్రతి ఒక్కరి జీవితంపై ప్రభావం చూపిన కరోనా, మనిషిలోని చెడును తగలబెట్టి మంచిని నిర్మించటమే ఈ భోగిమంటల అంతరార్థమని మంత్రి పేర్కొన్నారు. సంక్రాంతి పండగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని అన్నారు. ప్రతి కుటుంబంలోనూ సంతోషం వెల్లివిరియాలన్నారు.

ఇదీ చదవండి: రైతన్నలకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా తెదేపా రైతు భోగి కార్యక్రమం

ABOUT THE AUTHOR

...view details