ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కర్ఫ్యూ, 144 సెక్షన్​తో కరోనా కేసుల తగ్గుదల: సింఘాల్

By

Published : May 29, 2021, 6:23 PM IST

Updated : May 29, 2021, 8:45 PM IST

రాష్ట్రంలో ఇప్పటివరకూ 808 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ సింఘాల్ తెలిపారు. రాష్ట్రంలో కర్ఫ్యూ, 144 సెక్షన్ అమలు చేస్తుండటంతో కరోనా కేసుల పెరుగుదల తగ్గుతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని 66 ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు.

health secretary anil singhal
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ సింఘాల్

గత వారం రోజులుగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. మే 3న 25.5 శాతం ఉన్న పాజిటీవిటి రేటు, ప్రస్తుతం 17.29 శాతంగా ఉందని పేర్కొన్నారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన కర్ఫ్యూ, 144 సెక్షన్‌ అమలు కారణంగా కరోనా కేసుల నమోదు తగ్గుతోంది సింఘాల్ తెలిపారు.

కొత్త కేసుల నమోదులో తగ్గుదల...

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకూ 808 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదయ్యాయని... బ్లాక్‌ఫంగస్‌ వైద్యానికి అవవసరమైన ఇంజక్షన్లు, మాత్రలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు అనిల్ సింఘాల్ వెల్లడించారు. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నందున ఆక్సిజన్ వినియోగంలోనూ కొంత తగ్గుదల కనిపిస్తోందన్నారు. రోజుకు లక్ష మందికి టీకా వేసే సామర్థ్యం ఉందన్న సింఘాల్... కేంద్రం కేటాయించే టీకాల లభ్యత మేరకు ఎల్లుండి నుంచి వ్యాక్సినేషన్ చేపడతామని ప్రకటించారు. కరోనా టీకాలను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ సింఘాల్

ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణానికి నిర్ణయం...

రాష్ట్ర వ్యాప్తంగా 50 పడకల సామర్థ్యం కలిగిన ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ సహకారంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో పీఎస్ఏ ప్లాంట్ల నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం సబ్సిడీ అందజేయనుందని... వారం రోజుల్లో విధి విధానాలను వెల్లడిస్తామని సింఘాల్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలు పాటించని 66 ప్రైవేటు ఆస్పత్రులపై విజిలెన్స్ కేసులు నమోదు అయ్యాయని, వాటిలో 43 కేసులకు జరిమానాలు విధించామన్నారు. మిగిలిన 23 కేసులకు సంబంధించి జరిమానాపై నిర్ణయం తీసుకుంటున్నామన్నారు.

ఇదీ చదవండి:

అనాథ మృతదేహాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు: నారా భువనేశ్వరి

Last Updated : May 29, 2021, 8:45 PM IST

ABOUT THE AUTHOR

...view details