ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడ కనదుర్గమ్మను దర్శించుకున్న హంపీ పీఠాధిపతి

విజయవాడ కనకదుర్గమ్మ వారును హంపీ పీఠాధిపతులు శ్రీ విరూపాక్ష విద్యారణ్య స్వామీ దర్శించుకున్నారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టరు వాణిమోహన్‌, ఆలయ ఈవో డి.భ్రమరాంబ స్వాగతం పలికారు.

By

Published : Jul 19, 2021, 7:25 PM IST

hampi dean
హంపీ పీఠాధిపతి

హంపీ పీఠాధిపతులు శ్రీ విరూపాక్ష విద్యారణ్య స్వామీ విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి విచ్చేసిన స్వామి విద్యారణ్యకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టరు వాణిమోహన్‌, ఆలయ ఈవో డి.భ్రమరాంబ ఆలయమర్యాదలతో స్వాగతం పలికారు.

అనంతరం అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ వేదపండితులు స్వామికి వేదస్వస్తి పలికారు.

ఇదీ చదవండి:bangaru bonam :తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలనే 'బంగారు బోనం'

ABOUT THE AUTHOR

...view details